telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పార్టీ కార్యాలయంలో … చిదంబరం చిందులు..

congress chidambaram

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం అఙ్ఞాతం వీడి ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ లో ప్రత్యక్షమై కొంచెం సేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో కాంగ్రెెస్ పార్టీ కార్యాలయం వద్ద హై డ్రామా నెలకొంది. చిదంబరం ప్రెస్ మీట్ ప్రారంభమైన కొంచెం సేపటికే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దకు సీబీఐ అధికారులు చేరుకున్నట్టు సమాచారం.

ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలో కార్యాలయం గేట్లను మూసివేసి సీబీఐ అధికారులను అడ్డుకునేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. చిదంబరం నివాసం వద్దకు ఈడీ, సీబీఐ అధికారుల బృందం చేరుకున్నట్టు తెలుస్తోంది. ఏ క్షణంలో అయినా చిదంబరంను అధికారులు అదుపులోకి తీసుకుంటారని తెలుస్తోంది.

Related posts