telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

పాఠశాల విద్యార్థుల .. మందు పార్టీ.. ఆత్మహత్య ..

student suicide on birthday party with beer

పాఠశాల తరగతి గదిలో మద్యంతో విద్యార్థిని పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఇది చూసిన ఉపాధ్యాయుడు వారిని మందలించాడు. దీంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సేలం ఇడైపట్టి విద్యాజోన్‌కు చెందిన ఓ ప్రభుత్వ బాలికల మహోన్నత పాఠశాలలో 1,500 మంది విద్యార్థినులు చదువుతున్నారు. అబ్దుల్‌ కలాం జయంతి రోజునే ప్లస్‌టు చదువుతున్న ఓ విద్యార్థిని పుట్టిన రోజు కావడంతో ఐదుగురు విద్యార్థినులు తరగతి గదిలో కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచుకున్నారు. ఆ సమయంలో ఆ విద్యార్థినుల్లో ఓ విద్యార్థిని చేతిలో ఉన్న సంచిలో బీరు లాంటి మద్యం బాటిల్స్‌ ఉన్నాయి.

దీన్ని సెల్‌ఫోన్‌లో వీడియోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఆ సమయంలో తరగతిలోకి వచ్చిన ఓ ఉపాధ్యాయిని మద్యం బాటిల్స్‌తో ఉన్న విద్యార్థినులను చూసి ఆగ్రహించింది. తరువాత వారి తల్లిదండ్రులను పాఠశాలకు పిలిపించి వారి సమక్షంలో విద్యార్థినులను మందలించారు. ఈ క్రమంలో తల్లిదండ్రులుతో కలిసి ఇంటికి వెళ్లిన విద్యార్థిని ఒకరు హఠాత్తుగా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది చూసిన తల్లిదండ్రులు, పోలీసులకు, బంధువులకు తెలియజేయకనే విద్యార్థిని మృతదేహాన్ని దహనం చేశారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం కలిగించింది. దీనిపై జిల్లా ముఖ్య విద్యాధికారి విచారణ చేస్తున్నారు.

Related posts