telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

40 మంది స్టార్ క్యాంపెనర్లతో .. బీజేపీ..

బీజేపీ ఎన్నికల వ్యూహాన్ని అమలుచేస్తుంది. ప్రచారానికి సినీ రంగులు వాడుతుంది. ఒడిశా రాష్ట్రంలో అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రముఖ సినీనటి, మాజీ ఎంపీ హేమమాలినితోపాటు 40 మంది సినీతారలతో స్టార్ క్యాంపెనర్లను ఎన్నికల ప్రచారంలో దించాలని నిర్ణయించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలతోపాటు మధుర బీజేపీ ఎంపీ అభ్యర్థిని, ప్రముఖ సినీనటి హేమమాలిని, 9 మంది ఒడిశా సినీనటీనటులతో ప్రచారం చేపిస్తామని బీజేపీ ప్రకటించింది.

bjp with 40 star campaignersనాలుగు దశల్లో జరగనున్న ఒడిశా ఎన్నికల్లో ప్రచారానికి 40 మంది స్టార్ క్యాంపెనర్లను ఎంపిక చేసినట్లు బీజేపీ ఒడిశా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి జాబితాను సమర్పించింది. స్టార్ క్యాంపెనర్ల జాబితాలో కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్,నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ, ప్రకాష్ జవదేకర్, ధర్మేంద్ర ప్రధాన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్, అర్జున్ ముందా, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గొమాంగో, ఒడిశా సినీనటులు మిహీర్ దాస్, శ్రీతందాస్, మహేశ్వతారాజ్ అపరాజిత మహంతి, అనూ చౌదరి, పింకీ ప్రధాన్ లు ప్రచారం చేయనున్నారు. స్టార్ క్యాంపెనర్ల ప్రచారం బీజేపీని ఈ ఎన్నికల్లో గట్టెక్కిస్తుందా అనేది వేచి చూడాల్సిందే.

Related posts