telugu navyamedia
రాజకీయ

గుంటూరు టూ హైదరాబాద్ కు మరో రైలు సర్వీస్.. రద్దీ దృష్ట్యా.. 

Attack Railway TTI in Danapur express
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం గుంటూరు-హైదరాబాద్ కు మరో సర్వీస్ ను ప్రారంభించారు. ఈ సేవలు మార్చిలో రద్దీ దృష్ట్యా ప్రతీ ఆదివారం గుంటూరు మీదగా నరసాపూర్‌ – హైదరాబాద్‌ ప్రత్యేక రైలుని నడపనున్నట్లు రైల్వే సీనియర్‌ డీసీఎం డీ వాసుదేవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
నెంబరు. 07258 నరసాపూర్‌ – హైదరాబాద్‌ రైలు మార్చి 3, 10, 17, 24, 31 తేదీల్లో సాయంత్రం 6 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు గుంటూరు, 11.30కి సత్తెనపల్లి, అర్ధరాత్రి 12.01కి పిడుగురాళ్ల, 12.24కి నడికుడి, 12.55కి మిర్యాలగూడ, 1.30కి నల్గొండ, మరుసటి రోజు వేకువజామున 3.55కి సికింద్రాబాద్‌, 4.45కి హైదరాబాద్‌ చేరుకొంటుంది. 
ఈ రైలులో ఏసీ టూటైర్‌, మూడు త్రీటైర్‌, ఏడు స్లీపర్‌క్లాస్‌ బోగీలు, ఐదు జనరల్‌ బోగీలుంటాయని సీనియర్‌ డీసీఎం తెలిపారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Related posts