టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు గుప్పించారౌ. గత ఐదేళ్లలో చంద్రబాబు చేసిందేమీ లేదని అన్నారు. గత ఐదు సంవత్సరాల్లో ఏమీ చేయకుండా కాలయాపన చేశారన్నారు. ఐదు సంవత్సరాల్లో విశాఖను పర్యాటకంగా ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశించారు. డబ్బులన్నీ అమరావతికి పెట్టి మిగిలిన పథకాలు అన్ని పక్కకు నేట్టారని దుయ్యబట్టారు.
సీఆర్డీఏ అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఉదయం సింగపూర్, మధ్యాహ్నం చైనా కోసం మాట్లాడేవారు. అమరావతి రైతులపై అంత ప్రేమ ఉంటే.. లోకేష్ను అక్కడి ప్రజలు ఎందుకు ఓడించారో చెప్పాలి. సింహాచలం పంచగ్రామాల సమస్యను చంద్రబాబు పట్టించకోకుండా కాలయాపన చేశారని విమర్శించారు.