గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎట్టకేలకు కరోనాను జయించారు. తాజాగా ఎస్పీ చరణ్ తన తండ్రి హెల్త్ గురించి మాట్లాడుతూ కోవిడ్ -19 టెస్ట్ లో బాలూ గారికి నెగెటివ్ వచ్చిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, ఇంకా 3, 4 రోజుల్లో ఐసియు నుండి జనరల్ వార్డుకు బాలుని షిఫ్ట్ చేయనున్నారని వెల్లడించారు. ఇక తమ అభిమాన గాయకుడు త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రార్ధనలు చేశారు. కరోనా వైరస్ సోకడంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో చేరారు. మొదట జలుబు, జ్వరం వంటి స్వల్ప లక్షణాలతో బాధపడిన ఎస్పీ బాలు.. ఆగస్టు 13న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ రోజు నుంచి ఆయనకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు.