telugu navyamedia
సినిమా వార్తలు

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కన్నుమూత

Producer Anil
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కోనేరు అనీల్ కుమార్ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ స్టార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. తెలుగులో ‘రాధా గోపాలం’, ‘అల్లరి బుల్లోడు,  శ్రీరామ చంద్రులు, ఒట్టేసి చెబుతున్నా” వంటి సినిమాలను నిర్మించారు అనీల్ కుమార్. ఆయన మరణ వార్త తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. 
హీరో నాని త‌న ట్విట్ట‌ర్ ద్వారా అనీల్ కుమార్ మృతి ప‌ట్ల సంతాపం తెలియజేశారు. “అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేస్తున్న స‌మ‌యంలో అనీల్ కుమార్ సంత‌కంతో తొలి జీతం అందుకున్నాను. నా తొలి నిర్మాత‌, నా ఫ్యామిలీ, నా మెంట‌ర్‌. ఆయ‌న‌ని మిస్ కావ‌డం బాధ‌గా ఉంది. ఆయ‌న ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని ప్రార్ధిస్తున్నాను” అని నాని ట్వీట్ చేశారు. అలానే అల్ల‌రి నరేష్ కూడా త‌న ట్విట్ట‌ర్ ద్వారా అనీల్ కుమార్ మృతికి సంతాపం తెలిపారు.

Related posts