*బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని హాజరు
*జులై 2న హైదరాబాద్కు రానున్న ప్రధాని మోదీ
*రేపు ఎల్లుండి హైదరాబాద్లో మోదీ పర్యటన
*నగర వ్యాప్తంగా 5వేల మంది పోలీసు బందోబస్తు..
*జూలై 4 వరకు హైదరాబాద్లో 144 సెక్షన్
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్కు రానున్నారు .జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్ఐసీసీ నోవాటెల్లో ప్రధాని నరేంద్ర మోదీ బస చేయనున్నారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు.
దీంతో దాదాపు 5వేల మంది పోలీసు ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బందితో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.దాదాపు 600 సీసీ కెమెరాలు, అత్యాధునిక టెక్నాలజీతో పాటు అన్ని శాఖలను సమన్వయం చేసుకునే విధంగా ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ను, కెమెరాల వీక్షణ కోసం భారీ తెరలను ఏర్పాటు చేశారు
హెచ్ఐసీసీ ప్రాంగణంలో పాటు చుట్టూ 5 కిలోమీటర్ల మేర సెక్యురిటీతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జాయింట్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి భద్రత ఏర్పాట్లను నిత్యం పర్యవేక్షిస్తున్నారు..
ఇప్పటికే ఎస్పీజీ అధికారులు హెచ్ఐఐసీ ప్రాంగణంతో పాటు మోడీ బస ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. జులై 4 వరకు హైదరాబాద్లో 144 సెక్షన్ విదించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ లో మోదీ పర్యటనకు ఈ సారి భద్రతను కల్పిస్తున్నారు అధికారులు.