రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశిథరూర్ నేతృత్వంలోని సభ్యులు శిల్పారామంలోని రాక్ హైట్స్ లో మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ను శశిథరూర్ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా శశిథరూర్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని అన్నారు. గ్లోబల్ వార్మింగ్ను అరికట్టాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా పర్యావరణానికి మేలు కలిగించేందుకు మొక్కలు నాటే అవకాశం లభించినందుకు శశిథరూర్ సంతోషం వ్యక్తం చేశారు.