బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన “కొబ్బరి మట్ట” చిత్రం ఎన్నో అవాంతరాలని దాటుకుని ఆగస్ట్ 10న పేక్షకుల ముందుకు వచ్చింది. రోనాల్డ్ రూపక్ సన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సాయి రాజేష్ నీలం నిర్మించారు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు స్టీవ్ శంకర్ సమకూర్చడం జరిగింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. పాపారాయుడు, పెద రాయుడు, ఆండ్రాయుడ్ ఇలా మూడు పాత్రలలో కనిపించి ఆయన చెప్పిన నాన్స్టాప్ డైలాగ్స్కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తున్న క్రమంలో సంపూర్ణేష్ బాబు ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలో నేడు, రేపు విజయయాత్రలు చేయనున్నారు. “కొబ్బరిమట్ట” ప్రదర్శించబడుతున్న ఆయా థియేటర్లకు వెళ్లి నేరుగా అభిమానులను కలవనున్నారు. ఈ విషయాన్ని సంపూర్ణేష్ బాబు ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఈ రోజు కర్నూల్, అనంతపూర్, పొద్దూటూర్కి వెళ్ళనున్న సంపూ అండ్ టీం రేపు తిరుపతి, నెల్లూరు, కావలిలో విజయయాత్ర చేపట్టనున్నారు.
previous post
next post