ముంబై దాడుల్లో అమరవీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ‘మేజర్ ను తెరకెక్కుతోంది. ఇందులో లో అడివి శేష్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డిఎ)లో ఉన్న రోజుల్లో శేష్ “మేజర్” సందీప్ ఉన్నికృష్ణన్గా ఉన్న పిక్ ను పోస్ట్ చేశారు. ఎన్డిఎ యూనిఫాంలో క్లీన్-షేవ్ లుక్ తో శేష్ కనిపిస్తున్నాడు. 2008 ముంబై దాడుల్లో అమరవీరుడి లుక్ లో శేష్ అద్భుతంగా కనిపిస్తున్నాడు.
కాగా..మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కు నివాళులర్పిస్తూ, మేకర్స్ అతని బాల్యం, టీనేజ్, సైన్యంలో చేరడంతో సహా ఆయన జీవితంలోని విభిన్న దశల గురించి ప్రేక్షకులకు వెండితెరపై చూపించనున్నారు. కొంతకాలం క్రితం విడుదలైన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. “మేజర్”షూటింగ్ ఈ నెలాఖరుతో పూర్తవుతుంది.
అంతకుముందు జూలై 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. తెలుగు, హిందీ భాషలలో రూపొందుతోన్న ఈ ప్యాన్ ఇండియా చిత్రాన్ని మలయాళంలోనూ కూడా విడుదల చేయబోతున్నారు. ఇందులో శోభితా ధూళిపాల, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటించారు.