telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“యాత్ర” దర్శకుడికి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ?

Aa

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగుతో పాటు ఈ మూవీ నాలుగు భాషల్లో రిలీజ్ కానుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడీగా రష్మిక మందన్న నటిస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇంతకముందు వచ్చిన ఆర్య, ఆర్య 2 మంచి విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కు ట్రై చేస్తున్నారు. దానిలో భాగంగానే సుకుమార్ బన్నీ కోసం పాన్ ఇండియా లెవెల్ లో ఓ మూవీ స్టార్ట్ చేసారు. ఈ సినిమా తర్వాత బన్నీ మరో క్రేజీ దర్శకునికి ఒకే చెప్పారని తెలుస్తుంది. ఆనందో బ్రహ్మ, ఆ తర్వాత వై.యస్. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో ‘యాత్ర’ సినిమా తెరక్కెక్కించి హిట్ అందుకున్న మహి. వి. రాఘవ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. పూర్తి స్క్రిప్ట్‌తో వస్తే సినిమా చేస్తానని చెప్పాడట బన్నీ. ఇప్పుడు దర్శకుడు ఆ పనిలోనే నిమగ్నమయ్యారని తెలుస్తోంది.

Related posts