కోలీవుడ్ స్టార్హీరో ధనుష్కు మద్రాస్ హైకోర్టు ఆయనపై ఆగ్రహం వ్యక్తంచేసింది. 2015లో ధనుష్ అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేశారు. విదేశాల నుంచి దానిని దిగుమతి చేసుకున్నందుకుగాను చెల్లించాల్సిన పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆయన అదే ఏడాదిలో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
లగ్జరీ కారు కొనుగోలు విషయంలో పన్ను కట్టి తీరాల్సిందేనని కోర్టు తీర్పునిచ్చింది. ‘సామాన్య ప్రజలే ఒక సోపు కొన్నా ప్రభుత్వానికి టాక్స్ కడుతున్నాడు.. ఇక కోట్లు సంపాదించే వీఐపీల హోదాలో ఉన్న మీకు ఇబ్బంది ఏమిటి’ అంటూ ప్రశ్నించింది. చట్టం ముందు అందరూ సమానులేనని గట్టిగా చురకులు వేసింది.. లగ్జరీ కారు కొనుగోలు చేసి.. పన్ను మినహాయింపు ఎలా అడుగుతున్నారని ధనుష్ని నిలదీసింది.
అంతేకాకుండా అసలు ఇటువంటి పిటిషన్ వేయమని క్లయింట్ అడిగినప్పుడు న్యాయవాదులు .. పిటిషనర్ కి టాక్స్ ఎందుకు పే చేయాలో వివరించాల్సిన బాధ్యత లేదా అని జడ్జిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయితే ఇప్పటికే తాను 50 శాతం పన్ను చెల్లించానని మిగిలిన మొత్తాన్ని ఆగస్టు 9న కట్టేస్తానని ధనుష్ సమాధానమిచ్చారు. ఇటీవల తమిళ హీరో విజయ్కు సైతం ఇటీవల కోర్టు నుంచి ఇలాంటి అనుభవమే ఎదురైంది. పన్ను కట్టనందుకు విజయ్కు లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. తాజాగా ధనుష్ కూడా తన ఫారెన్ కారుకు పన్ను మినహాయింపు కోరుతూ, హైకోర్టు ఆగ్రహానికి గురయ్యాడు.