బాయ్స్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముంబై ముద్దుగుమ్మ జెనీలియా క్యూట్ యాక్టింగ్తో తెలుగు యూత్ మనసు దొచుకుంది . తెలుగు, తమిళ ప్రేక్షకులను తనదైన అందచందాలతో ప్రేక్షకులను అలరించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది క్యూట్ బ్యూటీ జెనిలియా. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ దగ్గర్నుంచి నితిన్, రామ్, రామ్ చరణ్ స్టార్ హీరోల సరసన నటించి కొన్నాళ్లు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది అనడంలో సందేహం లేదు.
కెరీర్ లో వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తున్న సమయంలోనే హిందీలో స్టార్ హీరో రితేశ్ దేశ్ముఖ్తో ప్రేమలో పడి, వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత జెనీలియా సినిమాలకు దూరంగా ఉంటూ.. పూర్తి సమయాన్ని తన కుటుంబానికి కేటాయించింది.
అయితే మొదటగా హిందీలో తుజే మేరీ కసమ్ హిందీ సినిమాలో హీరోయిన్గా, రితేశ్ హీరోగా నటించారు. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో జరుగింది. అయితే షూటింగ్ అనంతరం వీరిద్దరూ ఒకరినొకరు చాలా మిస్సయ్యారట.ఈ క్రమంలోనే వారిద్దరూ ప్రేమలో ఉన్నట్లుగా అర్థం చేసుకోన్నారంట. ఆ తర్వాత వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమగా చిగురించి పెళ్ళి వరకు వెళ్ళిందట.అలా దాదాపు 9 సంవత్సరాల పాటు వీరిద్ధరి ప్రేమ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచి, 2012 ఫిబ్రవరి 3న వీరిద్దరు వివాహ బంధంతో ఒకటయ్యారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇదిలా ఉంటేఇక అది అలా ఉంటే జెనిలియా త్వరలో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్ నడుస్తోంది. కాగా ఈరోజు జెనీలియా తన 34వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.