ప్రభాస్ హీరోగా రాబోతున్న భారీ సినిమా ‘ఆదిపురుష్’. ఇటీవలే ఈ భారీ బడ్జెట్ సినిమాను అఫీషియల్గా ప్రకటించారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటిస్తాడని, అలాగే రావణాసురిడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తాడని ప్రకటించిన చిత్రయూనిట్.. సీత క్యారెక్టర్ ఎవరు పోషిస్తారనేది మాత్రం సీక్రెట్గా ఉంచింది. దీంతో ‘ఆదిపురుష్’లో సీత క్యారెక్టర్పై పెద్దఎత్తున రూమర్స్ బయటకొచ్చాయి. సీతగా అనుష్క నటించనుందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా దీనిపై స్పందించిన ఆమె ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తూ దయచేసి అలాంటి రూమర్స్ నమ్మొద్దంటూ ప్రేక్షకులను రిక్వెస్ట్ చేసింది. తాను ‘ఆదిపురుష్’ సినిమాలో నటించడం లేదని, ఆ రూమర్స్ నమ్మొద్దని క్లారిటీ ఇచ్చేసింది. ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాలో తాను నటించబోతున్నాననే రూమర్స్ ఎలా మొదలయ్యాయో అర్థం కావడం లేదని అనుష్క పేర్కొంది. ఇప్పటివరకైతే ‘ఆదిపురుష్’ చిత్రయూనిట్ తనను సంప్రదించలేదని ఆమె చెప్పింది. ఒకవేళ అంత గొప్ప పాత్రలో నటించే అవకాశం తనకు వస్తే తానే అధికారికంగా వెల్లడిస్తాను కానీ ఇలాంటి పుకార్లను నమ్మొద్దని తెలిపింది అనుష్క. ఆమె చేసిన లేటెస్ట్ మూవీ ‘నిశ్శబ్దం’ అక్టోబర్ 2న విడుదల కాబోతోంది.
హీరోయిన్ సాయిపల్లవిపై కేసు నమోదు..