అలీబాబా గ్రూప్ సంస్థల అధిపతి, అపరకుబేరుడు జాక్ మాపై చైనా ప్రభుత్వం తాజాగా.. చైనా యొక్క యాంటీట్రస్ట్ రెగ్యులేటర్ తన ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లపై ప్రత్యర్థులు మరియు వ్యాపారులపై తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసిందంటూ 2.8 బిలియన్ డాలర్ల భారీ జరిమానా విధించింది. చైనాలో ఇదే రికార్డు స్థాయిలో జరిమానాగా చెబుతున్నారు.. అలీబాబా గ్రూప్ సంస్థల అధిపతి 37 బిలియన్ డాలర్లు విలువచేసే యాంట్గ్రూప్ ఐపీవోను అడ్డుకోవడం, బ్యాంకింగ్ రెగ్యులేషన్ నిబంధనలు అమలు చేయడం వంటి చర్యలతో తన గ్రూప్ విలువను అమాంతం తగ్గించారని.. అందుకే ఈ జరిమానా విధించినట్టు ప్రభుత్వం పేర్కొంది. అయితే, చైనా బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాల గురించి అలీబాబా గ్రూప్ సంస్థ అధినేత జాక్ మా.. గత సంవత్సరం కొన్ని వ్యాఖ్యలు చేశారు.. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్తత్వాన్ని వీడి విస్తృతంగా ఆలోచించాలని ఆయన సూచించారు.. ఇక, అప్పటి నుంచి జాక్ మా.. వారికి టార్గెట్గా మారిపోయాడనే ఆరోపణలు ఉన్నాయి.
previous post
ఏపీ మ్యాప్ లో అమరావతి లేకపోవడానికి వైసీపీనే కారణం: యనమల