అక్కినేని కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలే శాకుంతలం చిత్రీకరణను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2తో ఆకట్టుకున్న తర్వాత నెట్ ఫ్లిక్స్ తో సామ్ భారీ వెబ్ సిరీస్ కి సంతకం చేశారని కథనాలొచ్చాయి. రాజ్ అండ్ డీకే వెబ్ సిరీస్ లతో కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని గుసగుసలు వినిపించాయి.
ఇంతలోనే సమంత టాలీవుడ్ లో మరో చిత్రానికి సంతకం చేశారని తెలిసింది. శ్రీదేవి మూవీస్ నిర్మించే సినిమా కోసం సమంత రూత్ ప్రభు సంతకం చేసారట. బౌండ్డ్ స్క్రిప్ట్ తో దర్శకనిర్మాతలు సమంతను ఒప్పించారని తెలిసింది. ఒక కొత్త దర్శకుడుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
నవంబర్ నుండి ఈ చిత్రం కోసం సామ్ తన తేదీలను కేటాయించినట్లు టాక్. మేకర్స్ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. నవంబర్ లో సినిమాను ప్రారంభిస్తారు. శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ సహా ఇతరత్రా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
బాక్సర్ ఈవాండర్ హోలీఫీల్డ్కు శిక్షణ ఇచ్చింది కేఏ పాల్ : వర్మ