telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు మరోసారి కనికట్టు చేస్తున్నారు: సజ్జల

Sajjala ycp

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు మరోసారి కనికట్టు చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు. యునైటెడ్ ఫ్రంట్ ఉండగా సెక్యులర్ చొక్కా వేసుకున్నారని తెలిపారు.

పరాజయం తప్పదని తెలిసి స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా ఉండి కూడా వాజ్ పేయి నేతృత్వంలోని ఎన్డీయే వైపు పరిగెత్తారని ఆరోపించారు. వెంటనే చొక్కా మార్చేసి కాషాయవాదిగా అవతారం ఎత్తారని విమర్శించారు.

2004లో ఎన్డీయే ఓడిపోయినప్పుడు భవిష్యత్తులో ఎన్నడూ బీజేపీతో కలవనంటూ ఆ చొక్కా వదిలేసి మళ్లీ సెక్యులర్ చొక్కా వేసుకున్నారని తెలిపారు. 2019లో కాకిలెక్కలు వేసి తానొక జాతీయ నాయకుడిగా అవతారం ఎత్తారని పేర్కొన్నారు. బోర్లాపడ్డాక తన ఎంపీలందరినీ బీజేపీలోకి పంపారని తెలిపారు. ఢిల్లీ కరుణ కోసం  తానొక కాషాయవాది అన్నట్టు చంద్రబాబు మరోసారి కనికట్టు చేస్తున్నారని సజ్జల పేర్కొన్నారు.

Related posts