telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

కొరటాల దర్శకత్వంలో మరోసారి ప్రభాస్…?

Prabhas

మైత్రీ సంస్థ రెబల్ స్టార్ ప్రభాస్‌తో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ ప్రభాస్‌తో కూడా సినిమా చేయలని ఇటీవల ఫిక్స్ అయిందంట. అంతేకాకుండా ప్రతి హీరో కెరీర్‌లో 25వ సినిమా ఓ మైలురాయిగా చెప్పుకోవచ్చు. అదే విధంగా ప్రభాస్ కెరీర్‌లో చేయనున్న 25వ సినిమాను తెరకెక్కించాలని మైత్రి వారు సన్నాహాలు చేస్తున్నారంట. ఇందుకోసం ప్రభాస్ మిర్చి సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయిన దర్శకుడు కొరటాల శివతో సంప్రదింపులు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా మిర్చి టైంలో కొరటాలతో మరో సినిమా చేస్తానని ప్రభాస్ అన్నారు. కానీ తరువాత తమతమ ప్రాజెక్టుల కారణంగా వీరి కాంబోలో రెండో సినిమా రాలేదు. ఇప్పుడు ప్రభాస్ కెరీర్‌లోని మైలురాయి కోసం వీరిద్దరి కాంబోను రిపీట్ చేయాలని మైత్రి సంస్థ చూస్తోందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటి వరకు ఈవిషయంపై ఎటువంటి ప్రకటన రాలేదు. అతి త్వరలో మైత్రి వారు అధికారిక ప్రకటన ఇవ్వనున్నారని సినీ సర్కిల్స్ అంటున్నాయి. అయితే ప్రస్తుతం కొరటాల శివ చిరంజీవితో ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్‌తో మరో సినిమా చేయనున్నారంట. ఆ తరువాత ప్రభాస్ సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Related posts