telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

చానల్ ఏర్పాటు చేసుకుని అబద్ధాలు ప్రచారం: ఎంపీ అరవింద్

Arvind Bjp Mp

తెలంగాణ సీఎం కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు పాలన చేతకాదన్న విషయం దేశం మొత్తం కోడై కూస్తోందని నిజమాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. పరిపాలన చేసుకోకుండా అయ్యాకొడుకులు పొద్దున లేస్తే అబద్ధాలు చెబుతుంటారు అంటూ విమర్శించారు. పేపరు, చానల్ ఏర్పాటు చేసుకుని అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు.

వ్యవసాయ బిల్లులో లేనిది ఉన్నట్టు చెబుతూ రైతులను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఇవాళ వీళ్లిద్దరినీ తెలంగాణ ప్రజలు తన్నేందుకు తయారవుతున్నారు.

మంచి చేయడం ఎలాగూ నీకు మీ అయ్యకు చేతకాదు, కనీసం అబద్ధాలు చెప్పుకోవడం అయినా మానండి అని హితవు పలికారు. తెలంగాణకు 1400 వెంటిలేటర్లు కేటాయిస్తే ఇప్పటివరకు వాటిని వినియోగించింది లేదని విమర్శించారు. కరోనా చికిత్సలో దేశంలోనే తెలంగాణ తీసికట్టుగా ఉందన్న విషయం స్పష్టమవుతోందన్నారు.

Related posts