telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇలాంటి దాడులు ఏ సీఎం హయాంలో జరగలేదు: అఖిలప్రియ

buma akhilapriya

మంత్రి కొడాలి నాని తిరుమల డిక్లరేషన్ అంశంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని డీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విమర్శించారు. ఇంట్లో ఉన్నప్పుడు ఏ దేవుడిని అయినా పూజించుకోవచ్చని, అందులో ఎవరూ అభ్యంతరం చెప్పరని అన్నారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బయటికొచ్చినప్పుడు అన్ని మతాలను గౌరవించాలని అన్నారు.

రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు చేస్తూ అరాచకం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి దాడులు ఏ సీఎం హయాంలోనూ జరగలేదని ఆరోపించారు. ఇవాళ ఆలయాలు, రేపు మసీదులు, ఆపై చర్చిలపై దాడులు జరుగుతాయని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు.

దేవుళ్లకే రక్షణ కల్పించలేకపోతే రాష్ట్రంలో ప్రజలకు ఏం రక్షణ ఇస్తారని అఖిలప్రియ ప్రశ్నించారు. ఆలయాలపై దాడులకు పాల్పడుతున్న ముఠాను పట్టుకోవాలని అన్నారు. ప్రభుత్వానికి చేతకాకపోతే కేంద్రం ఒక బృందాన్ని ఏర్పాటు చేసి దాడులపై విచారణ జరిపించాలని అన్నారు.

Related posts