ఇంటర్మీడియెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని మంత్రి తన కార్యాలయంలో ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఫలితాల ప్రాసెస్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సాంకేతిక నిపుణులతో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.
అధికారులను పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రాసెస్లో సాంకేతిక సహకారాన్ని సీజీజీ నుంచి తీసుకుంటున్నామని, దాని నిర్వహణ తీరును ఈ కమిటీ ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. గతేడాది ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకొని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రామ మందిర విరాళాల సేకరణపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు…