telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ లో కోహ్లీని దాటేసిన ధావన్…

ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనింగ్ బ్యాట్స్మాన్ శిఖర్ ధావన్ బుధవారం మరో ఐపీఎల్ అర్ధ సెంచరీ సాధించాడు. దుబాయ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 30 బంతుల్లోనే అర్ధశతకం చేశాడు. ఐపీఎల్‌లో ఇది అతని 39 వ హాఫ్ సెంచరీ. దాంతో విరాట్ కోహ్లీ, సురేష్ రైనా మరియు రోహిత్ శర్మలను దాటి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన భారత బ్యాట్స్మాన్ ‌గా ధావన్ నిలిచాడు. ఆర్‌ఆర్‌తో జరిగిన మ్యాచ్ కు ముందు ధావన్ 38 అర్ధ సెంచరీలలో ముగ్గురు ఆటగాళ్లతో సమంగా ఉన్నాడు.

ఆదివారం అబుదాబిలో ముంబై ఇండియన్స్‌పై 52 బంతుల్లో అజేయంగా 69 పరుగులు చేసిన ధావన్ ఐపీఎల్ 2020 లో ధావన్ వరుసగా రెండో హాఫ్ సెంచరీ సాధించాడు. గత మ్యాచ్‌లో అతని ఇన్నింగ్స్‌కు ‘గేమ్‌ఛేంజర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించినప్పటికీ, అతను నెమ్మదిగా ఆడినందుకు సోషల్ మీడియాలో ట్రోల్ చేయబడ్డాడు. అయితే బుధవారం కేవలం 30 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు, ఇది ఐపీఎల్ లో అతని వేగవంతమైన అర్ధ సెంచరీ.

Related posts