telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

దుండిగల్ పరిధిలో తల్లి, కుమారుడు అదృశ్యం…

దుండిగల్ పియస్ పరిధిలో తల్లి (21), కుమారుడు(2) ల అదృశ్యం కలకలం సృష్టిస్తుంది. గండిమైసమ్మ చౌరస్త వద్ద నివాసముండే తన భార్య అంజని‌(21) కుమారుడు సహార(2) లు కనిపించడం లేదు అని భర్త స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు. తాను 13వ తేదీ డ్యూటీకి వెళ్లి తిరిగి 14 ఉదయం ఇంటికి వచ్చి చూడగ‌.. తన భార్య, కుమారుడు ఇంట్లో లేరని, అంతటా వెతికిన ఫలితం లేక పోవడంతో పోలీసులను ఆశ్రయించానని భర్త బసవరాజు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇక భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దుండిగల్ పోలీసులు. 13వ తేదీ రాత్రి ఎం జరిగింది అనే కోణం లో విచారణ ప్రారంభించిన పోలీసులు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. తల్లే కుమారుడును తీసుకొని ఎక్కడికైనా వెళ్లిపోయిందా.. లేక వారిని ఎవరియాన్ కిడ్నప్ చేసారా అనేది పోలీసుల విచారణలో తేలనుంది.

Related posts