సూపర్స్టార్ మహేష్బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్కి పరిచయమైంది కియారా ఆడ్వాణీ. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో మెరిసింది. ఆ తర్వాత `అర్జున్రెడ్డి’ హిందీ రీమేక్ `కబీర్ సింగ్`తో బాలీవుడ్లో కియార ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇటీవల `గుడ్న్యూస్` సినిమాతో మరో హిట్ను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ఈ భామ ఖాతాలోకి మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్స్టార్ మహేష్ బాబు చేయబోతున్న సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కియారను వరించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్గా కియారను తీసుకుంటే బాగుంటుందని మహేష్కు, వంశీ పైడిపల్లికి నమ్రత సూచించినట్టు సమాచారం. `భరత్ అనే నేను` సినిమా సమయంలో నమ్రతకు, కియారకు మధ్య స్నేహం కుదిరింది. మహేష్ ఇంటికి కూడా కియార వెళ్లింది. ఆ స్నేహంతోనే కియారను నమ్రత సిఫారసు చేసిందట. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
previous post
బిగ్ బాస్-3 : రాహుల్ ప్రపోజ్ చేస్తే… పునర్నవి కామెంట్స్