telugu navyamedia
క్రైమ్ వార్తలు

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం – ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

మహారాష్ట్రలోని నాగ్​పుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగ్‌పూర్ లోని సక్కర్దార వంతెన పై వేగంగా వస్తున్న ఓ కారు అదే దారిలో వస్తున్న వాహనాలపైకి దుసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. 

వివ‌రాల్లోకి వెళితే..

నిండితుడు గణేశ్​ అధావ్ తన స్నేహితుని కారు తీసుకుని బుట్టిబోరినికి వెళ్తున్నాడు. అర్ధరాత్రి అవ్వడం వల్ల బ్రిడ్జ్​పై ఎవరూ లేరని కారు వేగం పెంచాడు. మితిమీరిన వేగంతో ఎదురుగా వస్తున్న మూడు వాహనాలను వరుసగా ఢీకొట్టాడు.

అందులో ఓ బైక్​పై ఒక వ్యక్తి, అతని తల్లి, ఇద్దరు పిల్లలు ప్రయాణిస్తున్నారు.​ కారు ఢీకొట్టడం వల్ల వారు వంతెనపై నుంచి కింద పడిపోయారు. నీటిలో పడిపోయిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. స‌మాచారం అందుకున్న పోలీసులు కారు డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్న కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Related posts