telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

బ్రేకింగ్ : బాలుడిని హత్య చేసిన ఇద్దరు నిందితుల ఎన్ కౌంటర్ ?

మహబూబాబాద్ లో ఆదివారం రోజున కిడ్నాప్ అయిన బాలుడు దీక్షిత్ కథ విషాదాంతంగా ముగిసింది. అపహరణకు గురైన దీక్షిత్ ను కిడ్నాపర్లు హత్య చేసి కె సముద్రం మండలం, అన్నారం శివారులోని గుట్టపై పడేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్లు ఫోన్ చేసి బాలుడ్ని విడిచిపెట్టాలి అంటే రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ డబ్బు ఇచ్చేందుకు కూడా దీక్షిత్ తల్లిదండ్రులు సిద్ధం అయ్యారు. గత రాత్రి డబ్బు అందజేసేందుకు దీక్షిత్ తండ్రి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. దీక్షిత్ హత్య కేసులో వారి బంధువులు మనోజ్ రెడ్డి, సాగర్ తో సహా మరో ముగ్గురిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న నలుగురిని ఈరోజు ఉదయం 11 గంటలకు మీడియా ముందు ప్రవేశపెట్టబోతున్నారు. బాలుడిని హత్య చేసిన ఇద్దరు కిడ్నాపర్లు ఎన్‌కౌంటర్‌ అయినట్లు ప్రచారం జరుగుతోంది. కిడ్నాపర్ల ఎన్‌కౌంటర్‌పై అధికారికంగా పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనిపై పోలీసులు ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related posts