telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఈసారి ఐపీఎల్‌ 2020 యాంకరింగ్‌ మిస్సవుతున్నా : మాయంతి లాంగర్

Mayanti

“ఈసారి ఐపీఎల్‌ 2020 యాంకరింగ్‌ మిస్సవుతున్నా” అంటూ యాంకర్ మాయంతి లాంగర్ ట్వీట్ చేశారు. పలు ఐపీఎల్‌ సీజన్లలో యాంకరింగ్‌తో మంచి పాపులరిటీ సంపాదించుకున్నారు మాయంతి లాంగర్. ఆమె ఆరువారాల క్రితం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ.. “గత ఐదేళ్లుగా స్టార్‌స్పోర్ట్స్‌ తన కుటుంబంలో నన్ను ఒకదానిలా చూసింది. వారు నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఒక యాంకర్‌గా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించా. కరోనా లేకపోయుంటే మార్చిలో ఐపీఎల్‌ జరుగుంటే.. ఐదు నెలల ప్రెగ్నెన్సీతో యాంకరింగ్‌ చేద్దామనుకున్నా. కరోనా వల్ల దాదాపు కొన్ని నెలల తర్వాత ఐపీఎల్‌ మొదలవుతుంది. కానీ స్టార్‌స్పోర్ట్స్‌ యాజమాన్యం నాకు ఈ విషయంలో చాలా మద్దతునిచ్చింది. ఆ విషయంలో వారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నా. ఈసారి ఐపీఎల్‌ 2020 యాంకరింగ్‌ మిస్సవుతున్నా.. ఆరు వారాల క్రితం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చా. స్టువర్ట్‌ బిన్నీ, బిడ్డతో కలిసి మధురక్షణాలను అనుభవిస్తున్నా.. బాబు మా జీవితంలోకి ప్రేవేశించాకా చాలా కొత్తగా ఉంది. ఇంట్లోనే ఉంటూ రోజువారి ఐపీఎల్‌ మ్యాచ్‌లను స్టార్‌స్పోర్ట్స్‌లో చూస్తూ ఎంజాయ్‌ చేయబోతున్నా. ఈ సందర్భంగా మా గ్యాంగ్‌ సభ్యులైన సుహైల్‌ చాందోక్‌, క్రికెట్‌ ఆకాశ్‌, సంజన గణేషన్‌, జతిన్‌ సపారు, , బ్రెట్‌ లీ స్కాట్‌ బైరిస్‌ లాంటి వాళ్లను మిస్సవుతున్నా..” అంటూ తన భర్త ప్రముఖ క్రికెటర్‌ స్టువర్ట్‌​ బిన్నీతో కలసి చేతిలో బిడ్డతో దిగిన ఫోటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు.

Related posts