telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు దుర్మరణం

Accident

పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగన్నాథపురం వద్ద ఓ కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కాజ గ్రామానికి చెందిన వ్యక్తులు నరసాపురం మండలంలోని మచ్చపురి నుంచి రాజమహేంద్రవరం వెళ్తుండగా కారు అదుపుతప్పి నరసాపురం కాల్వలోకి దూసుకెళ్లింది.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. పోలీసులు, స్థానికుల సాయంతో కారును బయటికి తీశారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts