telugu navyamedia
క్రీడలు వార్తలు

ఆధిక్యంలోకి టీం ఇండియా…

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న చివరి టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 205 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది. ఆ తర్వాత నిన్న తమ మొదటి ఇనింగ్స్ ప్రారంభించిన టీం ఇండియా ఆట ముగిసే సమయానికి 24 పరుగులు చేసి ఒక్క వికెట్ కోల్పోయింది. అయితే ఈ రోజు ఆట మొదలైన కాసేపటికే పుజారా అవుట్ కాగా కోహ్లీ డక్ ఔట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన రహానే 27 పరుగులు చేసి ఔట్ కాగా రోహిత్ 49 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ కు చేరుకున్నాడు. అయితే ప్రస్తుతం భారత వికెట్ కీపర్ పంత్ (66) అర్ధశతకంతో సుందర్(25) పరుగులతో నిలబడటంతో భారత్ ఆధిక్యంలోకి వెళ్ళింది. ప్రస్తుతం భారత్ 209-6 తో నిలిచింది. అయితే ఈ రోజు ముగియడానికి ఇంకా 27 ఓవర్లు ఉండటంతో ఈ ఆధిక్యం ఎంత పెరుగుతుంది అనేది చూడాలి. ఒకవేళ ఈరోజు ఆట ముగిసే వరకు పంత్ అలాగే సుందర్ క్రీజులో ఉంటె మాత్రం భారత్ కు మంచి ఆధిక్యం లభిస్తుంది.

Related posts