సిద్దిపేట జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తెలంగాణ ఉద్యమంలో జానపద కళాకారునిగా ఎంతో పేరుగాంచారు రసమయి. ఇక తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ లోకి వెళ్లి మానకొండూర్ ఎమ్మెల్యే టికెట్ పొంది రెండుసార్లు గెలుపొందారు. అయితే తాజాగా రసమయి బాలకిషన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు ఆ కంపెనీ పరిధిలో బ్రతకాలని..సింగరేణిలో పనిచేస్తూ ఇంకో దగ్గర చేస్తా అంటే నడవదని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఇది లిమిటెడ్ కంపెనీ అని భావించుకుంటున్నానని..చాలా సమస్యలు ఉంటాయి.. తనను అనాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అయ్యాక తనకు చాలా మంది దూరమయ్యారని.. తెలంగాణ వచ్చాక పాటలు మారిపోయాయన్నారు. కలలు.. గళాలు మౌనంగా ఉంటే క్యాన్సర్ కంటే ప్రమాదమని.. ప్రతీ గాయకుడు ఆలోచించాల్సిన సమయం వచ్చిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా.. ఇటివలే రసమయి… స్థానిక సమస్యలను సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు అసభ్యపదజాలంతో ఓ యువకుడిని దూషించిన విషయం తెలిసిందే.
previous post
next post
పోతిరెడ్డిపాడును జగన్కు కేసీఆర్ గిఫ్ట్గా ఇచ్చారు: రేవంత్రెడ్డి