telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన రాశిఖన్నా

Rashi-khanna

ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించిన హీరోయిన్ రాశి ఖన్నా తన ఇంటి ఆవరణంలో మొక్కలు నాటింది. ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తెలిపింది రాశి. ఈ సందర్భంగా ప్రముఖ హీరోయిన్లు… రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ అలాగే తమన్నాలకు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసురుతున్నట్లు, వారు దీనిని స్వీకరించి మొక్కలను నాటి ఇదేవిధంగా ముందుకు కొనసాగించాలని పిలుపునిచ్చింది. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉధృతంగా కొనసాగుతోంది ఈ ఛాలెంజ్ లో భాగంగా నటీనటులు, ప్రముఖులు పెద్ద ఎత్తున మొక్కలు నాటి తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు.

Related posts