telugu navyamedia
సినిమా వార్తలు

లైగర్ టీంతో బాలయ్య ర‌చ్చ మామాలుగా లేదుగా..

నందమూరి బాలకృష్ణ హోస్ట్‏గా ప్రముఖ తెలుగు ఓటీటీలో ప్ర‌సార‌మ‌వుతున్నఅన్‏స్టాపబుల్ విత్ ఎన్‏బీకే షోతో ప్రేక్ష‌కులును ఫిదా చేస్తున్నారు. ఈ షోలో తనదైన ప్రత్యేకమైన కామెడీ పంచ్‌ల‌తో బాల‌య్య అదరగొడుతున్నారు. ఇప్పటికే ఈ షోకు ఎంతోమంది సినీ తారలు విచ్చేసి సందడి చేశారు. మెహన్ బాబు, రాజమౌళి, బ్రహ్మనందం, రవితేజ, రానా, అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేని వంటి ప్రముఖులు వచ్చి సందడి చేశారు.

Up Next: Best Of Balakrishna In Films & Politics?

తాజాగా..సంక్రాంతి స్పెషల్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌లో ‘లైగర్’ టీమ్ సందడి చేసింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మి, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ముగ్గురూ కలిసి బాలయ్య బాబు ముచ్చట్లతో ఎంజాయ్ చేశారు.

లైగర్ సినిమా విషయాలు, షూటింగ్ సంగతులతో పాటు తమ తమ వ్యక్తిగత విషయాలపై ఓపెన్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.

అందులో బాలయ్య మాట్లాడుతూ.. టాక్ షో అనగానే మడి కట్టుకుని కూర్చుని.. నాలుగు ప్రశ్నలు అడిగి.. అవతలి వ్యక్తి తెలివిగా జవాబులు చెబితే అవి వినడం నా వల్ల కాదని చెప్పాను.. అందుకు ఒక షరతు కూడా పెట్టాను. వచ్చిన వాళ్లను ఆడుకుంటానని చెప్పాను అని అన్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండను సెట్ లో వేలాడదీసిన శాండ్ బ్యాగ్ ను తన్నమన్నారు. విజయ్ గట్టిగా దాన్ని తన్నడంతో అది తిరిగి వెనక్కు వచ్చింది.

దీంతో బాలకృష్ణ నటించిన మొదటి చిత్రం ఏది ? అని ప్రశ్నించగా.. విజయ్ ఆలోచనలో పడ్డారు. షోకు వచ్చిన అభిమానుల్లో ఒకరు తాతమ్మ కల అని సమాధానం చెప్పగా.. వాడు నా చేతిలో అయిపోయాడు ఖతం అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చారు.

అంతేకాకుండా.. బాలకృష్ణ చెప్పిన ‘సారా దండకం’ కూడా భలేగా ఆకట్టుకుంది. గుక్కతిప్పుకోకుండా, తడబడకుండా నటసింహం పాడిన ఈ పద్యం మందు బాబులతో పాటు సాధారణ ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ని ఓ వ్యక్తి ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో సదరు వీడియో వైరల్ అవుతోంది.

Related posts