నందమూరి హీరో బాలకృష్ణ ఆసుపత్రిలో చేరారు. ఆయన కుడి భుజం నొప్పి తీవ్రం కావడంతో బాలయ్య కేర్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ క్రమంలో వైద్యులు ఆయన కుడి భుజానికి సర్జరీ నిర్వహించారు.
బాలయ్యకు బంజారాహిల్స్లోని కేర్ ఆసుపత్రిలోని డాక్టర్ రఘువీర రెడ్డి.. డాక్టర్ బీఎన్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం.. దాదాపు 4 గంటలు శస్త్రచికిత్స చేశారు. ఈ రోజు సాయంత్రం డిశ్చార్జ్ కానున్నారు. బాలకృష్ణకు ఆరు వారాలపాటు విశ్రాంతి అవసరం అని డాక్టర్లు సూచించారు.
ఈ మేరకు కేర్ ఆసుపత్రి వైద్యులు ఆయన హెల్త్ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. త్వరలోనే ఆయనను డిశ్చార్జ్ చేస్తామని కూడా వైద్యులు స్పష్టం చేశారు.
కాగా..గత ఆరు నెలలుగా ఆయన భుజం నొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చేరారని కేర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.