telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రైతులకు మోడీ సర్కార్‌ శుభవార్త…

రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా విలయం కొనసాగుతున్న తరుణంలో… పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు 2 వేల ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇప్పటికే రైతుల ఖాతాలోకి 7 విడతల నగదు జమ కాగా..ఇప్పుడు 8వ విడతల డబ్బులను అందించాలని కేంద్రం నిర్ణయించింది. రేపు ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా విడుదల చేస్తామని కేంద్రం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 9.5 కోట్ల రైతు కుటుంబాలకు రూ. 19000 కోట్ల సాయం అందుతుందన్నారు. ప్రతి ఏడాది 3 విడుతాల్లో రూ. 2 వేల చొప్పున రూ. 6 వేలు ఖాతాల్లో డిపాజిట్ చేయనున్నారు.

Related posts