వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యే ‘క్లైమాక్స్. ‘నగ్నం’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ దర్శకుడు ’పవర్ స్టార్’ అనే సినిమా చేస్తున్నాడు. ‘ఎన్నికల తర్వాత కథ’ అంటూ వస్తున్న ఈ సినిమా ట్రైలర్ చూడాలంటే 25 రూపాయలు చెల్లించాలి. ఈ నెల 22న ఆ ట్రైలర్ విడుదల కానుంది. అయితే ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళికి కూడా అదే సలహా ఇచ్చాడు వర్మ. “హే రాజమౌళి ప్రపంచమంత ఆన్లైన్లోకి మారిపోయింది… అదే ప్రస్తుతం సినిమాలన్నిటికీ కొత్త మార్కెట్… ప్రస్తుతం ఇప్పుడంతా సరి కొత్తగా ఆలోచించడం కావాలి.. మేమంతా ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ని డబ్బులు ఇచ్చి చూసే సమయం కోసం వేచి చూస్తున్నాం” అంటూ రామ్ గోపాల్ వర్మ ఒక ట్విట్ పెట్టగా అది సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా టైటిల్ పోస్టర్ తో పాటు రామ్ చరణ్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి రాజమౌళి ఈ విషయంపై ఎలా స్పందిస్తాడో చూడాలి.
Hey @ssrajamouli in the context that the whole world shifted online that is the actual real market place and these NEW TIMES need NEW THINKING 💪💪💪 we are all waiting to pay and see #RRR trailer 💃💃💃 pic.twitter.com/NPer8VHQKe
— Ram Gopal Varma (@RGVzoomin) July 20, 2020