సుశాంత్ గర్ల్ఫ్రెండ్ రియా చక్రబర్తి సోషల్ మీడియా వేదికగా.. సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలంటూ హోంమంత్రి అమిత్ షా కు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే సుశాంత్ చనిపోవడానికి రియా కూడా కారణమంటూ సోషల్ మీడియాలో కొందరు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే తనను చంపుతామంటూ తనపై అత్యాచారం చేస్తామంటూ కొంతమంది సోషల్ మీడియాలో బెదిరిస్తూ ఉన్నారని నటి రియా చక్రబర్తి కంప్లైంట్ చేసింది. ఈ విషయంపై ఆమె స్పందిస్తూ కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాకు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై మహారాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి స్పందించారు. నటి రియా ఫిర్యాదుపై విచారణ చేస్తామని ఆమెను సోషల్ మీడియాలో బెదిరిస్తున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ విషయంలో మహారాష్ట్ర హోం మంత్రితో మాట్లాడి ఆమెను వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకునేలా చూస్తానంటూ ఆ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి హామీ ఇచ్చారు .