ప్రముఖ నటి కీర్తి సురేశ్ ‘మహానటి’ చిత్రంలో తన నటనకు గాను జాతీయ ఉత్తమ నటి అవార్డును దక్కించుకున్న ఆనందానికి అవధుల్లేవు. తనను అవార్డు వరించడంపై ఆమె స్పందిస్తూ, చాలా సంతోషంగా ఉందని, ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని పేర్కొంది.
‘మహానటి’ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్, ప్రొడ్యూసర్లు స్వప్న, ప్రియాంక, అశ్వనీదత్.. అందరికీ ‘నా పెద్ద పెద్ద థ్యాంక్స్’ అన్న కీర్తి సురేశ్, ఈ అవార్డును తన తల్లికి అంకితం చేస్తున్నట్టు చెప్పింది. ప్రముఖులందరూ కీర్తి సురేష్ కి శుభాకాంక్షలు తెలిపారు.