హీరో శర్వానంద్ ‘శ్రీకారం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో కిషోర్ రెడ్డి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. 14రీల్స్ పతాకంపై రాం అచంట, గోపీ అచంట నిర్మిస్తుండగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా చేస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ విడుదల అయింది. ‘కనివిని ఎరుగని కథ ఇక మొదలైంది. అడుగులో అడుగుగా.. వెతికిన వెలుగుల అలికిడి ఎదురైంది’ అంటూ సాగుతున్న పాట అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమాపై ఈ పాట అంచనాలను పెంచేస్తుంది.
previous post
next post
నన్ను అక్రమ సంబంధం పెట్టుకునేవాడిగానే చూస్తున్నారు… హీరో ఆవేదన