telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

పవర్ స్టార్ సినిమాకు ఇద్దరు దర్శకులు…నిజమేనా…?

Pspk27

పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చేసినా తర్వాత వరుస సినిమాలతో దూసుకెళుతున్నాడు. మూడేళ్ల గ్యాప్ ఇచ్చిన పవన్ రీఎంట్రీ తర్వాత మొదటగా పింక్ రీమేక్ మూవీ ‘వకీల్ సాబ్’ లో నటించారు. ఈ మూవీ ఏప్రిల్ 9న రిలీజ్ కు సిద్దమైంది. ప్రస్తుతం ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటుగా పవన్ ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎ.ఎం.రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటించనుందని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఈ సినిమా కుదిరినంత త్వరగా పూర్తి చేసి ఎఫెక్ట్స్ పై దృష్టి పెట్టాలి. అందులో భాగంగా మేకర్స్ సినిమాను రెండు భాగాలుగా విభజించారంట. అందులో మొదటి భాగాన్ని క్రిష్ డైరెక్ట్ చేస్తే, రెండో భాగాన్ని హైదరాబాద్ నవాబ్స్, నిన్న నేడు రేపు, పరిచయం సినిమాలను తెరకెక్కించిన లక్ష్మీకాంత్ డైరెక్ట్ చేయనున్నారంట. పెద్ద సినిమాలకు ఇలా సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇది పవన్ కెరీర్‌లో 27వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా పై అభిమానుల్లో లంచాలు చాలానే ఉన్నాయి.

Related posts