స్వరూపానందేంద్ర స్వామి విశాఖ శారదాపీఠం పీఠాధిపతి గా కొనసాగుతున్న విషయం తెలిసిందే, ఆ స్వామి పదవి కాలం ముగుస్తుండటంతో, కొత్త పీఠాధిపతి కి బాధ్యతలు అప్పగించాల్సి సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో తన శిష్యుడైన 26 ఏళ్ల కిరణ్ కుమార్ శర్మ (బాలస్వామి)ని ఉత్తరాధికారిగా నియమించాలని ఆయన నిర్ణయించారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో విజయవాడలోని కృష్ణానది కరకట్టపై ఉత్తరాధికారి శిష్య తురీయాశ్రమ దీక్షా స్వీకార మహోత్సవం జరగనుంది.
ఈ కార్యక్రమానికి ఇరు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్,ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్, ఇతర ప్రముఖులతో పాటు భారీ సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు. విశాఖ జిల్లా భీమునిపట్నంలో పోణంగి హనుమంతరావు, ప్రభావతమ్మ దంపతులకు 1993 ఏప్రిల్ 4న బాలస్వామి జన్మించారు. మూడో తరగతి చదువుతున్న సమయంలో ఫీఠానికి చేరుకున్న బాలస్వామి… స్వరూపానందస్వామికి ప్రధాన శిష్యుడిగా ఎదిగారు.
చంద్రబాబు ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు తిరగబడ్డారు: రోజా