telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

సెట్‌లోనే పుష్ప షూటింగ్..?

Pushpa

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ హీరోగా పుష్పా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే దీనికి ముందు సుకుమార్ రామ్ చరణ్‌తో కలిసి రంగస్థలం సినిమాను చేశాడు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలుసు. ఈ సినిమాను రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని గ్రమాల్లో చిత్రీకరించారు. కానీ అక్కడ అభిమానుల దెబ్బకు మకాం మార్చేసి, హైదరాబాదులోని జూబ్లీహిల్స్ సమీపంలోని నిర్మనుష్య ప్రాతంలో రాజమండ్రి లుక్ సెట్ చేసిన సినిమాను పూర్తిచేశారు. అయితే సుకుమార్ ప్రస్తుతం సుకుమార్, అల్లుఅర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా పుష్పకూ ఇదే తరహార ప్లానింగ్ వేశాడు. పుష్ప షూటింగ్‌ను రామజండ్రి మారెడుమల్లీ అడవుల్లో కాస్త పూర్తిచేశారు. ఆ తరువాత వారణాసి వెళుతుంటే టీమ్‌లో వారికి కరోనా పాజిటివ్ అని తేలడంతో వెనక్కి వచ్చేశారు. ఇప్పడు పూష్పను అదే తీరులో పూర్తి చేయాలని సుక్కు అనుకుంటున్నాడట. ఈ నిర్మించనున్న సెట్‌లో కీలక సన్నివేశాలను చేసి, మిగిలిన వాటిని అడవుల్లో చేద్దామని సుకుమార్ ఆలోచిస్తున్నాడని, అందుకోసం గాను సెట్‌ తయారీ ఇప్పటికే ప్రారంభం అయిందని సమాచారం. ఇది పూర్తి కాగానే షూటింగ్ మొదలు చయనున్నారిన చెబుతున్నారు.

Related posts