telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

యురేనియం విషయంలో తెలంగాణ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి : కిషన్ రెడ్డి

Kishan Reddy

సువిశాలమైన నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు వద్దంటూ పలు రాజకీయ పార్టీల నుంచి నిరసన వ్యక్తమైన సంగతి తెలిసిందే. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని తీర్మానిస్తూ కేసీఆర్ సర్కారు అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి స్పందించారు.ఈ అంశం పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. యురేనియం విషయంలో తెలంగాణ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం అనుమతుల మేరకే కేంద్ర ప్రభుత్వం యురేనియం లభ్యతపై పరిశోధనలు చేస్తోందని, అక్కడ జరుగుతున్నది తవ్వకాలు కాదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. యురేనియం లభ్యతపై పరిశోధనల కోసం మూడేళ్ల కిందట అనుమతులు ఇచ్చింది నిజం కాదా? అంటూ టీఆర్ఎస్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts