telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కొన్నిఫేక్ బతుకులు ఎప్పటికీ మారవు: నారా లోకేశ్

Nara Lokesh

కొన్ని ఫేక్ బతుకులు ఎప్పటికీ మారవని టీడీపీ నేత నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. టీడీపీ సోషల్ మీడియా విభాగాన్ని ఉండవల్లి అనూషకు అప్పగిస్తున్నట్టు తన పేరిట ప్రచారం అవుతున్న ఓ లేఖపై నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. అది ఫేక్ లేఖ అని స్పష్టం చేశారు.

“జగన్ గారూ, నన్ను ఇబ్బందిపెట్టేందుకు పడుతున్న కష్టంలో ఒక్క శాతం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పెట్టినా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తారు. అలాకాకుండా, నన్ను టార్గెట్ చేయడమే మీ లక్ష్యమైతే ఆల్ ది బెస్ట్!” అంటూ ట్వీట్ చేశారు. జగన్ వేసే 5 రూపాయల చిల్లర కోసం వైసీపీ పేటీఎం బ్యాచ్ సొంత తల్లిపై తప్పుడు పోస్టు పెట్టే స్థాయికి దిగజారిపోయిందని విమర్శించారు.

Related posts