జూనియర్ ఎన్టీఆర్ ఆయన భార్య లక్ష్మీ ప్రణతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకి హోస్ట్గా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్ ఎన్టీఆర్.. హాట్ సీట్లో ఉన్నకంటెస్టెంట్స్కు ప్రశ్నలు అడగటంతో పాటు వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ.. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటున్నారు.
తాజాగా హాట్ సీటులో కూర్చున్న కంటెస్టెంట్తో తన వివాహానికి సంబంధించిన పలు విషయాలను ప్రస్తావించారు ఎన్టీఆర్. కంటెస్టెంట్ పెళ్లి చూపులు సమయంలో కనీసం మీరు బాగా మాట్లాడారమ్మా కానీ మా పెళ్లి చూపుల్లో అయితే మా ఆవిడ అసలు మాట్లాడలేదని తన వివాహానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
పెళ్లి చూపుల సమయంలో లక్ష్మీ తనతో అస్సలు మాట్లాడలేదని చెప్పిన ఎన్టీఆర్.. తాను లక్ష్మీని చూడగానే ఓకే చెప్పానని తెలిపారు. అయితే లక్ష్మీ మాత్రం తనకు వెంటనే ఎస్ చెప్పలేదని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఎన్టీఆర్ లక్ష్మీతో మాట్లాడుతూ.. ‘నేనంటే ఇష్టమేనా లేక బలవంతంగా ఈ పెళ్లిని ఫిక్స్ చేశారా’ అని అడిగాడంటా అయితే దానికి ఆమె అప్పట్లో ఔనని కానీ కాదని కానీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. పెళ్లికి, ఎంగేజ్మెంట్కు మధ్య 8 నెలల గ్యాప్ వచ్చిన సమయంలోనూ ప్రణతి ఎన్టీఆర్కు ఎస్ అని చెప్పలేదంటా.. ఆ సమయంలో ఆడవాళ్లను అర్థం చేసుకోవడం ఎంత కష్టమో అర్థమైందంటూ ఎన్టీఆర్ తెలిపారు.
అంతేకాకుండా.. ‘ఆడవాళ్లను అర్ధం చేసుకున్నవాడు ప్రపంచంలో దేన్నైనా అర్ధం చేసుకుంటాడనే విషయం నాకు ఆ తర్వాత అర్థమైంది’ అంటూ ఫన్నీ కామెంట్ చేశారు ఎన్టీఆర్. వీరికి అభయ్రామ్, బార్గవ రామ్ ఇద్దరు కుమారులు.ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా సరే భార్య, పిల్లలతో సరదగా గడుపుతుంటారు జూనియర్.
ఇక కెరీర్ విషయానికొస్తే న్టీఆర్, రామ్ చరణ్తో కలిసి దర్శకుడు రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తికాగానే కొరటాల శివ, ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమాలో నటించనున్నారు.
పవన్ వల్ల తలవంపు… శర్వానంద్ షాకింగ్ కామెంట్స్