telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అనుష్క శెట్టి కెమెరా ముందుకొచ్చి నేటికి సరిగ్గా 15 ఏళ్లు

Anushka

అనుష్క శెట్టి కెమెరా ముందుకొచ్చి నేటికి సరిగ్గా 15 ఏళ్లు. సరిగ్గా మార్చి 12న నాగార్జున హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సూపర్’ సినిమాతో తొలిసారి కెమెరా ముందుకు వచ్చింది స్వీటీ. ఇక అరుంధతి, రుద్రమదేవి వంటి సినిమాలతో మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇక ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ భామ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘నిశ్శబ్ధం’ అనే సినిమా చేసింది. ఈ సినిమాలో అనుష్క చెవిటి, మూగ అయిన బధిర యువతి పాత్రను పోషించింది. మరో కథానాయిక అంజలి ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. హేమంత మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో షాలినీ పాండే, మాధవన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కరోనా ఎఫెక్ట్ కారణంగా ఇప్పటికే షెడ్యూల్ అయిన చాలా చిత్రాల విడుదల వాయిదా పడుతున్నాయి. మరి చెప్పిన సమయానికి నిశ్శబ్ధం థియేటర్స్‌లో విడుదలవుతుందా లేదా అనేది చూడాలి. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ్‌తో పాటు ఇంగ్లీష్‌లో కూడా విడుదల చేయనున్నారు.

Related posts