telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కపూర్ ఫ్యామిలీ పురాతన భవనంలో దెయ్యాలు, భూతాలు…!!

Kapoor

బాలీవుడ్ దివంగత నటుడు రిషి కపూర్ ఫ్యామిలీకి చెందిన ఓ భవనంలో దెయ్యాలు, భూతాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. పృథ్వీరాజ్ కపూర్ తనయుడైన దిగ్గజ దర్శకులు, నిర్మాత, నటుడు రాజ్‌ కపూర్ జన్మ స్థలం పాకిస్థాన్‌లోని పేషావర్‌. అక్కడ వారికి వారసత్వం ద్వారా వచ్చిన ఆస్తులు, భవనాలు కూడా ఉన్నాయి. అయితే అక్కడి నుంచి ముంబై వచ్చి సెటిలైన ఆ కుటుంబం మళ్ళీ అటువైపుకు వెళ్లకుండా ఈ దేశంలోనే స్థిరపడిపోయింది. అయితే పాకిస్థాన్‌ దేశంలోని పేషావర్‌లో కపూర్ వంశానికి చెందిన ఓ పురాతన భవనం ఇప్పటికీ ఉంది. 1918 -1920 కాలంలో నిర్మించిన ఆ భవనంలో దాదాపు 50 గదులు ఉన్నాయట. దీని పేరు ‘కపూర్ హవేలీ’. ఆ భవనం వాడుకలో లేకపోవడంతో దానిని మ్యూజియంగా మార్చాలని పాకిస్థాన్ ప్రభుత్వానికి 2018 సంవత్సరంలో రిషికపూర్ వినతి పత్రం ఇచ్చారు. దీంతో ప్రభుత్వం కూడా అందుకు సిద్ధమైంది. కానీ నివాస ప్రాంతాలకు దూరంగా ఉండటం, చాలా ఏళ్లుగా ఆ బంగ్లాలో ఎవ్వరూ ఉండకపోవడంతో అందులో భూతాలున్నాయని స్థానికులు ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆ బంగ్లాను పర్యాటకప్రాంతంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనను విరమించుకొందట పాకిస్తాన్ గవర్నమెంట్. ఈ క్రమంలోనే ఆ బంగ్లాను కూల్చివేసి వాణిజ్య సముదాయంగా మార్చేందుకు ఓ నగల వ్యాపారి ముందుకొచ్చారట. ప్రస్తుతం కపూర్ ఫ్యామిలీ ఆ భవనాన్ని పట్టించుకోకపోవడంతో ప్రజల్లో ఉన్న అపోహలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆ బంగ్లా కూల్చివేతకు అక్కడి ప్రభుత్వం కూడా ఓకే చెప్పిందని తెలుస్తోంది.

Related posts