పరిస్థితులు బాగా లేవు అందరూ అప్రమత్తంగా ఉండండి, ఏది మన చేతిలో లేదంటూ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ మూవీ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ చేసిన అభిమానుల్లో గందగోళాన్ని సృష్టింస్తోంది.
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటం వల్ల జనవరి 7న వస్తుందనుకున్న పాన్ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా పడినట్లు మేకర్స్ ప్రకటించగా .. ఇప్పుడు అందరి దృష్టి జనవరి14న విడుదల కావాల్సిన ‘రాధేశ్యామ్’పై పడింది. అనుకున్న రోజుకే ఈ చిత్రం విడుదల అవుతుందా లేదా అని టాక్ నడుస్తుండగా.. మంగళవారం రాధేశ్యామ్ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది.
సమయం చాలా కఠినంగా ఉంది. మనసులు బలహీనంగా మారాయి. మనసులో ఏదో అల్లకల్లోలంగా ఉంది. జీవితం మనపైకి వేటిని విసిరినా.. మన ఆశలు మాత్రం ఎప్పుడూ ఉన్నతంగానే ఉండాలి. సురక్షితంగా ఉండండి, ఉన్నతంగా ఆలోచించండి’ అంటూ రాసుకొచ్చాడు.
దీనికి స్పందించిన ఓ అభిమాని కామెంట్ చేస్తూ.. ‘ఇన్ డైరెక్ట్గా పోస్ట్పోన్ అంటున్నావా అన్నా’ అని ప్రశ్నించగా, ‘అలాంటిది ఏదైనా ఉంటే డైరెక్ట్గా అధికారికంగా చెబుతాం’ అని రిప్లై రాధాకృష్ణ క్లారిటీ ఇచ్చారు.
Times are tough, hearts are weak, minds in mayhem. Whatever life may throw at us – Our hopes are always High. Stay safe, stay high – Team #radheshyam
— Radha Krishna Kumar (@director_radhaa) January 4, 2022