ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రౌద్రం..రణం..రుధిరం’ (ఆర్ఆర్ఆర్).ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ లలో ఫుల్ బిజీగా ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తున్న ఈ సినిమా ఈవెంట్ ను ముంబై లో ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు..
“ఆర్ఆర్ఆర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబై ఫిల్మ్ సిటీ సమీపంలోని గురుకుల్ మైదానంలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ .. “నాకు జూనియర్ ఎన్టీఆర్ నటన అంటే చాలా ఇష్టం. ఆయన చాలా సహజంగా నటిస్తారు.
ఇక నేను రామ్ చరణ్ని కలిసిన ప్రతిసారీ, అతనికి ఏదో ఒక గాయం లేదా మరొకటి ఉంటుంది. ఆయన తన ప్రాజెక్ట్ల సెట్లో ఉన్నప్పుడు తరచుగా గాయపడతాడు. తన ప్రాజెక్టుల కోసం ఆయన పడే శ్రమ అలాంటిది. చరణ్ నిజమైన హార్డ్ వర్కర్’ అంటూ ఇద్దరు హీరోలను ప్రశంసలతో ముంచెత్తారు.
అలాగే “ఆర్ఆర్ఆర్” రిలీజ్ అయ్యాక కనీసం 4 నెలల వరకు ఏ సినిమానూ విడుదల చేయకపోవడమే మంచిది’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అంతేకాకుండా సల్మాన్ ఖాన్ తన అభిమానులకు ఇది శుభవార్త. డిసెంబర్ 19న సూపర్ స్టార్ తన హిట్ చిత్రం ‘భజరంగీ భాయిజాన్’ రెండో భాగాన్ని ‘ఆర్ఆర్ఆర్’ వేదికపై అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ (దర్శకుడు రాజమౌళి తండ్రి) సీక్వెల్ స్క్రిప్ట్ రాశారని సల్మాన్ తెలిపారు.