ఎన్నో అంచనాలతో జూలై 22న ప్రారంభమైన ‘బిగ్బాస్’ సీజన్ 3కు ఈ ఆదివారం (నవంబర్ 3న) శుభం కార్డు పడనుంది. అనేక మలుపులు, టాస్క్లతో వంద రోజులకు పైగా సాగుతున్న ‘బిగ్’ రియాల్టీ షో ఇది. 17 మంది సభ్యులు ‘బిగ్బాస్’ హౌస్లోకి అడుగుపెట్టారు. అయితే గతవారం శివజ్యోతి ఎలిమినేట్ కాగా, ఈ వారం ఎలాంటి నామినేషన్ ప్రక్రియలు ఉండవు. శ్రీముఖి, బాబా భాస్కర్, అలీరెజా, రాహుల్, వరుణ్ సందేశ్లు ఫైనల్కు చేరుకున్నారు. వీళ్లలో ఒకరికి మాత్రమే రూ. 50 లక్షలు గెలుచుకొనే అవకాశం ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజేత ఎవరనే దానిపై ప్రస్తుతం హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఈ ఫినాలేను బిగ్బాస్ నిర్వాహకులు భారీ రేంజ్లో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినపడుతున్న వార్తల ప్రకారం మెగాస్టార్ చిరంజీవి ఫైనల్కు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని టాక్. కాగా ఇప్పుడు ఈ ఫైనల్కు నిర్వాహకులు మరింత గ్లామర్ అద్దుతున్నారట. ఫైనల్లో మూడు పాటలకు అంజలి, క్యాథరిన్, నిధి అగర్వాల్ డ్యాన్స్ చేయబోతున్నారని టాక్. ఈ గ్రాండ్ ఫినాలే విన్నర్ ఎవరో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.
previous post